వందేమాతరం ఆపాలన్నారా? సోనియా, ఖర్గే సైగలపై దుమారం
- వందేమాతరం వేళ సోనియా, ఖర్గే సైగలు వైరల్
- కాంగ్రెస్పై బీజేపీ తీవ్ర విమర్శలు
- వందేమాతరం ఆపేందుకు యత్నించారని ఆరోపణ
- దాంట్లో ఎలాంటి వివాదం లేదన్న అశోక్ గెహ్లాట్
- పార్టీ వివరణ ఇస్తుందన్న సీనియర్ నేత
కాంగ్రెస్ ఆఫీసులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందేమాతరం చుట్టూ కొత్త వివాదం మొదలైంది. పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే చేసిన సైగలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ఇద్దరూ చేతులతో కొన్ని సంకేతాలు చేశారు. సోనియా అక్కడి నిర్వాహకులపై ఏదో విషయంలో అసహనం వ్యక్తం చేసినట్లుగా వీడియోలో కనిపించింది. గేయాన్ని ఆపాలని సూచించినట్లుగా ఆ సైగలు కనిపించాయని అధికార పక్షం ఆరోపిస్తోంది.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా, ఖర్గే పక్కనున్న వారివైపు చేతులతో సంకేతాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు గేయాన్ని ఆపాలని చెప్పారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గీతాన్ని గౌరవించడం లేదంటూ బీజేపీ సహా పలువురు విమర్శలు చేశారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ను మీడియా ప్రశ్నించింది. ఇందులో ఎలాంటి వివాదం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ వైఖరిని పార్టీ అధిష్ఠానం లేదా జైరాం రమేశ్ వివరిస్తారని తెలిపారు. అయితే వీడియోలో కనిపించిన సైగలపై కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు పూర్తి వివరణ రాలేదు.
వందేమాతరం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. వందేమాతరం పూర్తి రూపాన్ని కాంగ్రెస్ గతంలో కుదించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో తాజాగా జరిగిన ఘటన బీజేపీకి మరో రాజకీయ అస్త్రంగా మారింది.
కేరళలోనూ వందేమాతరం అంశం చర్చయానీయాంశమైంది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో జనగణమనకు ప్రాధాన్యం ఇచ్చి వందేమాతరం ప్రస్తావన చేయకపోవడంపై బీజేపీ విమర్శలు చేసింది. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ పాల్గొన్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జనగణమనకు ముందు వందేమాతరం ఆలపించారు.
ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిగాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే సహా పలువురు నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా, ఖర్గే పక్కనున్న వారివైపు చేతులతో సంకేతాలు చేశారు. దీంతో కాంగ్రెస్ నేతలు గేయాన్ని ఆపాలని చెప్పారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. కాంగ్రెస్ నాయకత్వం జాతీయ గీతాన్ని గౌరవించడం లేదంటూ బీజేపీ సహా పలువురు విమర్శలు చేశారు.
ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ను మీడియా ప్రశ్నించింది. ఇందులో ఎలాంటి వివాదం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ వైఖరిని పార్టీ అధిష్ఠానం లేదా జైరాం రమేశ్ వివరిస్తారని తెలిపారు. అయితే వీడియోలో కనిపించిన సైగలపై కాంగ్రెస్ నుంచి ఇప్పటివరకు పూర్తి వివరణ రాలేదు.
వందేమాతరం విషయంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. వందేమాతరం పూర్తి రూపాన్ని కాంగ్రెస్ గతంలో కుదించిందంటూ ప్రధాని మోదీ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యాలయంలో తాజాగా జరిగిన ఘటన బీజేపీకి మరో రాజకీయ అస్త్రంగా మారింది.
కేరళలోనూ వందేమాతరం అంశం చర్చయానీయాంశమైంది. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో జనగణమనకు ప్రాధాన్యం ఇచ్చి వందేమాతరం ప్రస్తావన చేయకపోవడంపై బీజేపీ విమర్శలు చేసింది. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోదీ పాల్గొన్న స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జనగణమనకు ముందు వందేమాతరం ఆలపించారు.