కర్ణాటకలో గుట్కా, పాన్మసాలాపై ఒక ఏడాది నిషేధం
- ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం
- ఉత్తర్వులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్
- రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు
కర్ణాటక ప్రభుత్వం గుట్కా, పొగాకు లేదా నికోటిన్ ఉన్న పాన్మసాలా తయారీ, నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకాలపై ఒక ఏడాది పాటు రాష్ట్రవ్యాప్త నిషేధం విధించింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫుడ్ సేఫ్టీ కమిషనరేట్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం 2006, సంబంధిత రెగ్యులేషన్ల కింద ఈ నిషేధం అమలులోకి వచ్చింది. పొగాకు లేదా నికోటిన్ ఉన్న గుట్కా, పాన్మసాలా మాత్రమే కాకుండా... ఏ పేరుతో అయినా అమ్ముతున్న ఇలాంటి ఉత్పత్తులు, ప్యాక్డ్ లేదా అన్ప్యాక్డ్ ఉత్పత్తులపై కూడా ఈ నిషేధం వర్తిస్తుంది.
ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇలాంటి ఉత్పత్తుల్లో మాదకద్రవ్యాలు కలపడం జరుగుతోందని హెచ్చరించి, డ్రగ్-ఫ్రీ కర్ణాటక లక్ష్యంగా ముందుకు వెళతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉల్లంఘనలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఇలాంటి ఉత్పత్తుల్లో మాదకద్రవ్యాలు కలపడం జరుగుతోందని హెచ్చరించి, డ్రగ్-ఫ్రీ కర్ణాటక లక్ష్యంగా ముందుకు వెళతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.