ఓటరు ముసాయిదా జాబితా లొసుగులు: 'సర్' నోటీసు వస్తే ఏం చేయాలి?
- ఓటర్ల జాబితా సవరణపై ఆందోళన
- లక్షలాది మంది డేటాలో వైరుధ్యాలు
- ముసాయిదాలో పేరు లేకపోయినా భయం వద్దన్న సీఈవో సుదర్శన్ రెడ్డి
- అన్మ్యాప్డ్, అనామలీ ఓటర్లకు నోటీసులు
- ఆగస్టు 17న ముసాయిదా, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో తమ ఓటు హక్కు రద్దవుతుందేమోనని పౌరుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 73 లక్షల మంది వివరాలు లభించకపోవడం, మరో 80 లక్షల మంది డేటాలో తప్పులు దొర్లడంతో ఈ గందరగోళం మొదలైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి స్పందిస్తూ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ముసాయిదా జాబితాలో పేరు లేనంత మాత్రాన ఓటు శాశ్వతంగా తొలగించినట్లు కాదని, అర్హులైన ప్రతి ఒక్కరూ సరైన ఆధారాలతో తిరిగి క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.
ఎన్నికల సంఘం అధికారులు జారీ చేయనున్న నోటీసులపై సీఈవో స్పష్టత ఇచ్చారు. 2002 రికార్డులతో సరిపోలని వారిని 'అన్మ్యాప్డ్' కేటగిరీగా, పేర్లు, వయసు, చిరునామాలో తేడాలున్న వారిని 'అనామలీ' కేటగిరీగా గుర్తించారు. ఈ రెండు వర్గాల వారికి నోటీసులు జారీ అవుతాయని, వాటికి అనుగుణంగా సరైన ధ్రువపత్రాలు సమర్పించి వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. ఒకవేళ జాబితాలో అసలు పేరే లేకపోతే ఫారం-6 ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు సీఈవో వెల్లడించారు. దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించడానికి సెప్టెంబరు 15 వరకు గడువు ఉంటుంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం, అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా మరణించిన వారు (9.22 లక్షలు), శాశ్వతంగా వలస వెళ్లిన వారు (45.18 లక్షలు), రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి (6.70 లక్షలు) పేర్లను నిర్ధారించుకున్న తర్వాతే తొలగిస్తామన్నారు. అధికారులు పంపే నోటీసులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సుదర్శన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల సంఘం అధికారులు జారీ చేయనున్న నోటీసులపై సీఈవో స్పష్టత ఇచ్చారు. 2002 రికార్డులతో సరిపోలని వారిని 'అన్మ్యాప్డ్' కేటగిరీగా, పేర్లు, వయసు, చిరునామాలో తేడాలున్న వారిని 'అనామలీ' కేటగిరీగా గుర్తించారు. ఈ రెండు వర్గాల వారికి నోటీసులు జారీ అవుతాయని, వాటికి అనుగుణంగా సరైన ధ్రువపత్రాలు సమర్పించి వివరాలు సరిచేసుకోవాలని సూచించారు. ఒకవేళ జాబితాలో అసలు పేరే లేకపోతే ఫారం-6 ద్వారా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు సీఈవో వెల్లడించారు. దీనిపై అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరించడానికి సెప్టెంబరు 15 వరకు గడువు ఉంటుంది. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించిన అనంతరం, అక్టోబరు 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని వివరించారు. ఈ ప్రక్రియలో భాగంగా మరణించిన వారు (9.22 లక్షలు), శాశ్వతంగా వలస వెళ్లిన వారు (45.18 లక్షలు), రెండు చోట్ల ఓట్లు ఉన్న వారి (6.70 లక్షలు) పేర్లను నిర్ధారించుకున్న తర్వాతే తొలగిస్తామన్నారు. అధికారులు పంపే నోటీసులను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే స్పందించాలని సుదర్శన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.