విద్యుత్ వాహన రంగంలో కోట్ల ఉద్యోగాలు.. జీతాలూ ఎక్కువే!
- 2030 నాటికి ఈవీ రంగంలో 4 కోట్ల ఉద్యోగాలు
- 85-90 శాతం ఉద్యోగాలు పరోక్షంగా ఏర్పడే అవకాశం
- నియామకాలు ఏటా 15-20 శాతం పెరగనున్నట్లు అంచనా
- నైపుణ్యం ఉన్నవారికి 45 శాతం వరకు ఎక్కువ జీతాలు
- బ్యాటరీ, ఛార్జింగ్ రంగాల్లో ఉద్యోగాలు భారీగా పెరిగే ఛాన్స్
- అడ్కో ఇండియా నివేదిక
విద్యుత్ వాహనాల (ఈవీ) రంగం దేశంలో భారీగా ఉద్యోగాలు కల్పించనుంది. 2030 నాటికి ఈ రంగంలో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని అడ్కో ఇండియా నివేదిక తెలిపింది. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ కేంద్రాలు, వాహనాల సర్వీసింగ్, సాఫ్ట్వేర్, ఫ్లీట్ నిర్వహణ, బ్యాటరీ రీసైక్లింగ్ వంటి రంగాల్లో అవకాశాలు పెరగనున్నాయి.
ఈ ఉద్యోగాల్లో కేవలం 10-15 శాతం మాత్రమే నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి ఉంటాయని అడ్కో అంచనా వేసింది. మిగతా 85-90 శాతం ఉద్యోగాలు ఈవీల చుట్టూ ఏర్పడే ఇతర రంగాల్లో వస్తాయని పేర్కొంది. దీంతో సంప్రదాయ కార్ల తయారీ కేంద్రాలకే ఉద్యోగాలు పరిమితం కావని స్పష్టం చేసింది.
ఈవీ రంగంలో నియామకాలు ఏటా 15-20 శాతం పెరగొచ్చని నివేదిక తెలిపింది. ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్ 35 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. ఈవీ రంగంలో అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి సంప్రదాయ ఇంజిన్ వాహనాల ఉద్యోగాలతో పోలిస్తే 45 శాతం వరకు ఎక్కువ జీతాలు లభించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈవీ రంగంలో ఉద్యోగాల్లో వాహనాల తయారీ వాటా 50-55 శాతం ఉండొచ్చని అడ్కో తెలిపింది. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ సదుపాయాలు, బ్యాటరీల రీసైక్లింగ్ రంగాల్లో వేగంగా ఉద్యోగాలు పెరగనున్నాయి.
దేశంలో ఈవీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఛార్జింగ్ కేంద్రాలు, సర్వీసింగ్ కేంద్రాలు, ఫ్లీట్ నిర్వహణకు సిబ్బంది అవసరం పెరుగుతుంది. ఢిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఈవీ పాలసీ కింద దాదాపు 30 వేల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త ఉద్యోగాల్లో 40-50 శాతం తొలుత కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చే అవకాశం ఉందని అడ్కో తెలిపింది. తర్వాత వాటిలో కొన్ని శాశ్వత ఉద్యోగాలుగా మారొచ్చని పేర్కొంది. ఈవీ రంగం కోసం బ్యాటరీలు, సాఫ్ట్వేర్, ఛార్జింగ్ వ్యవస్థలపై నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు.
ఈ ఉద్యోగాల్లో కేవలం 10-15 శాతం మాత్రమే నేరుగా వాహనాల తయారీకి సంబంధించినవి ఉంటాయని అడ్కో అంచనా వేసింది. మిగతా 85-90 శాతం ఉద్యోగాలు ఈవీల చుట్టూ ఏర్పడే ఇతర రంగాల్లో వస్తాయని పేర్కొంది. దీంతో సంప్రదాయ కార్ల తయారీ కేంద్రాలకే ఉద్యోగాలు పరిమితం కావని స్పష్టం చేసింది.
ఈవీ రంగంలో నియామకాలు ఏటా 15-20 శాతం పెరగొచ్చని నివేదిక తెలిపింది. ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్ 35 శాతం వరకు పెరగవచ్చని అంచనా వేసింది. ఈవీ రంగంలో అవసరమైన నైపుణ్యాలు ఉన్నవారికి సంప్రదాయ ఇంజిన్ వాహనాల ఉద్యోగాలతో పోలిస్తే 45 శాతం వరకు ఎక్కువ జీతాలు లభించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈవీ రంగంలో ఉద్యోగాల్లో వాహనాల తయారీ వాటా 50-55 శాతం ఉండొచ్చని అడ్కో తెలిపింది. బ్యాటరీ తయారీ, ఛార్జింగ్ సదుపాయాలు, బ్యాటరీల రీసైక్లింగ్ రంగాల్లో వేగంగా ఉద్యోగాలు పెరగనున్నాయి.
దేశంలో ఈవీల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఛార్జింగ్ కేంద్రాలు, సర్వీసింగ్ కేంద్రాలు, ఫ్లీట్ నిర్వహణకు సిబ్బంది అవసరం పెరుగుతుంది. ఢిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఈవీ పాలసీ కింద దాదాపు 30 వేల ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
కొత్త ఉద్యోగాల్లో 40-50 శాతం తొలుత కాంట్రాక్ట్ పద్ధతిలో వచ్చే అవకాశం ఉందని అడ్కో తెలిపింది. తర్వాత వాటిలో కొన్ని శాశ్వత ఉద్యోగాలుగా మారొచ్చని పేర్కొంది. ఈవీ రంగం కోసం బ్యాటరీలు, సాఫ్ట్వేర్, ఛార్జింగ్ వ్యవస్థలపై నైపుణ్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచించారు.