సరికొత్త సామాజిక క్యాంపెయిన్.. రకుల్, సమంతలకు కాజల్ సవాల్!
- తన లేటెస్ట్ మూవీ 'ది ఇండియన్ స్టోరీ' ప్రమోషన్స్లో భాగంగా క్యాంపెయిన్ ను ప్రారంభించిన కాజల్
- ఆహార కల్తీ, ప్రజలపై పడుతున్న దుష్ప్రభావాలపై క్యాంపెయిన్
- మనం తినే ఆహారం నిజంగానే సురక్షితమా అని ప్రశ్న
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన లేటెస్ట్ చిత్రం ‘ది ఇండియన్ స్టోరీ’ ప్రమోషన్స్లో భాగంగా సామాజిక అవగాహన క్యాంపెయిన్ను ప్రారంభించింది. పురుగుమందుల వాడకం, ఆహార కల్తీ, దానివల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాలను ఈ సినిమాలో చూపించారు. చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్, శ్రేయస్ తల్పడే జంటగా నటించారు.
ఈ క్రమంలో, కాజల్ ‘#WhatsOnYourPlate’ (మీ ప్లేట్ లో ఏముంది) అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. తన రాత్రి భోజనం ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా అని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారం పట్ల మరింత శ్రద్ధ వహించాలని కోరింది. ఈ ఛాలెంజ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంతలను కూడా పాల్గొనమని సవాల్ విసిరింది.
నటుడు శ్రేయస్ తల్పడే కూడా కాజల్ అభిప్రాయాన్ని బలపరుస్తూ పోస్ట్ చేశాడు. ప్రజలందరూ బాధ్యతాయుతమైన వినియోగదారులుగా మారాలని, మనం ప్లేట్లలో పెట్టుకుని తినే ఆహారం వెనుక ఉన్న అసలు నిజాలు, నివేదించబడని సమస్యలపై చర్చ జరగాలని శ్రేయస్ పిలుపునిచ్చాడు.
ఈ చిత్రం వివరాల్లోకి వస్తే... జీ స్టూడియోస్, ఎమ్ఐజీ ప్రొడక్షన్ స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరించాయి. సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రం జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాజల్ సృష్టించిన ఈ ఛాలెంజ్ నెటిజన్ల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.
ఈ క్రమంలో, కాజల్ ‘#WhatsOnYourPlate’ (మీ ప్లేట్ లో ఏముంది) అవగాహన ప్రచారాన్ని ప్రారంభించింది. తన రాత్రి భోజనం ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, మనం తినే ఆహారం నిజంగా సురక్షితమేనా అని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ తాము తినే ఆహారం పట్ల మరింత శ్రద్ధ వహించాలని కోరింది. ఈ ఛాలెంజ్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంతలను కూడా పాల్గొనమని సవాల్ విసిరింది.
నటుడు శ్రేయస్ తల్పడే కూడా కాజల్ అభిప్రాయాన్ని బలపరుస్తూ పోస్ట్ చేశాడు. ప్రజలందరూ బాధ్యతాయుతమైన వినియోగదారులుగా మారాలని, మనం ప్లేట్లలో పెట్టుకుని తినే ఆహారం వెనుక ఉన్న అసలు నిజాలు, నివేదించబడని సమస్యలపై చర్చ జరగాలని శ్రేయస్ పిలుపునిచ్చాడు.
ఈ చిత్రం వివరాల్లోకి వస్తే... జీ స్టూడియోస్, ఎమ్ఐజీ ప్రొడక్షన్ స్టూడియోస్ సమర్పకులుగా వ్యవహరించాయి. సాగర్ బి. షిండే కథ అందించడంతో పాటు, నిర్మాతగానూ వ్యవహరించారు. ఈ చిత్రం జూలై 24న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కాజల్ సృష్టించిన ఈ ఛాలెంజ్ నెటిజన్ల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.