ఉరేసుకున్న ప్రేమికురాలు: మృతదేహానికి ప్రేమికుడు తాళి కట్టాలని కుటుంబసభ్యుల ఆందోళన

Keerthi suicide family demands lover tie thali to dead body
  • పెళ్లికి నిరాకరించడంతో ముంబైలో యువతి ఆత్మహత్య
  • ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్న జంట
  • ప్రియుడి ఇంటి ఎదుట మృతదేహంతో కుటుంబ సభ్యుల నిరసన
  • మృతదేహానికి తాళి కట్టాలని బంధువుల డిమాండ్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రేమ విఫలమైందన్న మనస్తాపంతో గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువతి ముంబైలో ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడమే ఆమె మృతికి కారణమని ఆరోపిస్తూ, బాధిత కుటుంబ సభ్యులు యువకుడి ఇంటి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

గుంటూరు జిల్లా కొండ్రుపాడు గ్రామానికి చెందిన కీర్తి (26), ప్రకాశం జిల్లా పొందూరు మండలానికి చెందిన సాయి గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరి బంధం వివాహం వరకు సాగలేదు. పెళ్లి చేసుకోవాలని కీర్తి కోరగా, సాయి నిరాకరించాడని సమాచారం. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన కీర్తి, జులై 14న ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

కీర్తి మృతదేహాన్ని ముంబై నుంచి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు, ప్రకాశం జిల్లాలోని సాయి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తమ కుమార్తె చివరి కోరిక మేరకు సాయి ఆమె మృతదేహానికి తాళి కట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో సాయి కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. ఈ క్రమంలో నిందితుడి ఇంటి గేటును పగలగొట్టి లోపలికి వెళ్లేందుకు కీర్తి కుటుంబ సభ్యులు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 
Advertisement
Keerthi
Sai
Guntur girl suicide
Mumbai suicide
Prakasam district protest
failed love case

More Telugu News