కొత్త ఈపీఎస్ స్కీమ్.. ఈ 5 బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి!

EPS 2026 provides financial protection for family after employee death
  • ఈపీఎస్ 2026 కింద చందాదారుల కుటుంబాలకు ఆర్థిక భద్రత
  • ఉద్యోగి మరణిస్తే వితంతు, పిల్లల, అనాథ పెన్షన్ల సౌకర్యం
  • 1995 నాటి పథకం స్థానంలో అమల్లోకి వచ్చిన కొత్త పెన్షన్ స్కీమ్
  • నామినీ, ఆధారపడిన తల్లిదండ్రులకు కూడా పెన్షన్ ప్రయోజనాలు
  • కనీస నెలవారీ పెన్షన్ రూ. 1,000గా యథాతథం
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) చందాదారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే దిశగా 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) 2026' ఒక కీలక ముందడుగుగా నిలుస్తోంది. ఒకవేళ చందాదారుడు అకాల మరణం చెందితే, వారి కుటుంబ సభ్యులకు వితంతు, పిల్లల, అనాథ, నామినీ లేదా ఆధారపడిన తల్లిదండ్రుల పెన్షన్ రూపంలో తగిన ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఈపథకం అండగా నిలుస్తుంది.

సోషల్ సెక్యూరిటీ కోడ్-2020లో భాగంగా ఈ నూతన ఈపీఎస్-2026 పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇది 2026 జూన్ చివరి నుంచి అమల్లోకి వచ్చింది. 1995 నాటి పాత పథకం స్థానంలో దీన్ని తీసుకువచ్చినప్పటికీ, కుటుంబ ప్రయోజనాలకు సంబంధించిన కీలక నిబంధనలను యథాతథంగా కొనసాగించారు. వ్యవస్థీకృత రంగంలోని లక్షలాది మంది కార్మికులు, వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.

కుటుంబానికి అందే 5 రకాల ప్రయోజనాలు:

1. వితంతు పెన్షన్: అర్హులైన ఈపీఎస్ సభ్యుడు మరణించిన సందర్భంలో, వారి జీవిత భాగస్వామికి (భార్య/భర్త) జీవితాంతం లేదా వారు పునర్వివాహం చేసుకునే వరకు నెలవారీ పెన్షన్ లభిస్తుంది.
2. పిల్లల పెన్షన్: జీవిత భాగస్వామికి అందే పెన్షన్‌తో పాటు, గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు 25 ఏళ్లు నిండేవరకు అదనంగా పెన్షన్ అందిస్తారు. ఒకవేళ పిల్లలు శాశ్వత వైకల్యంతో బాధపడుతుంటే, వారికి జీవితాంతం ఈ ప్రయోజనం అందుతుంది.
అనాథ పెన్షన్: చందాదారుడికి జీవిత భాగస్వామి లేని పక్షంలో, పిల్లలకు అనాథ పెన్షన్ కేటాయిస్తారు. ఇది సాధారణ వితంతు పెన్షన్‌లో 75 శాతం వరకు ఉంటుంది.
4. నామినీ పెన్షన్:  చందాదారుడు అవివాహితుడైనా లేదా పైన పేర్కొన్న అర్హులైన కుటుంబ సభ్యులు లేకపోయినా, వారు నామినేట్ చేసిన వ్యక్తికి ఈ పెన్షన్ ప్రయోజనం చేకూరుతుంది.
5. ఆధారపడిన తల్లిదండ్రులకు పెన్షన్: పైన పేర్కొన్న కేటగిరీలలో ఎవరూ లేనప్పుడు మాత్రం పైన తెలిపిన ఏ కేటగిరీలోనూ లబ్ధిదారులు లేని పక్షంలోనే, చందాదారుడిపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ పెన్షన్ వర్తిస్తుంది. ఇందులో మొదట తండ్రికి, ఆ తర్వాత తల్లికి ప్రాధాన్యత ఉంటుంది.

ఈ పథకానికి అర్హత సాధించాలంటే ఉద్యోగి కనీసం ఒక నెల పాటు ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూట్ చేసి ఉండాలి. నూతన నిబంధనల ప్రకారం క్లెయిమ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ, వ్యవస్థలో జవాబుదారీతనం పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Advertisement
EPS 2026
Employees Pension Scheme
EPFO family pension benefits
Social Security Code 2020
EPF death claim benefits

More Telugu News