24 గంటలు ఇలా ప్లాన్ చేస్తే... ఆరోగ్యం మీ సొంతం!
- రోజును మూడు భాగాలుగా విభజించాలని నిపుణుల సూచన
- 8 గంటల నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి
- పనిని 8 గంటల్లో ముగిస్తే మంచిదని సూచన
- మిగిలిన సమయం ఆరోగ్యకర అలవాట్లకు కేటాయించాలి
- అందరికీ ఒకే విధానం వర్తించదని స్పష్టీకరణ
- జీవనశైలికి తగ్గట్టు మార్చుకుంటేనే మంచి ఫలితం
ఉదయం కళ్లు తెరిచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు పరుగుల జీవితమే. పని ఒత్తిడిలో నిద్ర తగ్గిపోతోంది. కుటుంబానికి, మనసుకు సమయం దొరకడం లేదు. ఇలా సమతుల్యత కోల్పోయిన జీవనశైలి అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోందని వైద్యులు చెబుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో రోజును సమంగా విభజించే ‘8-8-8 రూల్’ మంచి అలవాట్లకు పునాది వేయగలదని సూచిస్తున్నారు.
ఏంటీ రూల్?
ఈ విధానంలో రోజులోని 24 గంటలను మూడు సమాన భాగాలుగా విభజించాలి. ఎనిమిది గంటలు నిద్రకు, ఎనిమిది గంటలు ఉద్యోగం లేదా పనికి కేటాయించాలి. మిగిలిన ఎనిమిది గంటలు వ్యాయామం, ఆహారం, కుటుంబంతో గడపడం, అభిరుచులు, విశ్రాంతి కోసం వినియోగించాలి. ఉత్పాదకతతో పాటు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. ఈ విధానాన్ని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకుని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రే ఆరోగ్యానికి బలం
ఈ మూడు భాగాల్లో నిద్రకు అత్యధిక ప్రాధాన్యం ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు సుమారు ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరం పునరుత్తేజం పొందుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. నిద్రలేమి వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
పని.. పరిమితిలోనే మంచిది
ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఎనిమిది గంటల పని, మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని వెల్లడిస్తున్నారు. అయితే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బంది, షిఫ్టుల్లో పనిచేసేవారికి ఈ సమయాన్ని కచ్చితంగా పాటించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. అలాంటి వారు వీలైనప్పుడల్లా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మిగిలిన ఎనిమిది గంటలు ఇలా..
వ్యక్తిగత సమయాన్ని కేవలం విశ్రాంతికే పరిమితం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, అభిరుచులకు సమయం కేటాయించడం ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ సమయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం, వయసు, జీవనశైలికి అనుగుణంగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
అందరికీ ఒకే సూత్రం కాదు
8-8-8 రూల్ను కచ్చితమైన నిబంధనగా కాకుండా ఓ మార్గదర్శకంగా చూడాలని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. కీళ్ల సమస్యలు ఉన్నవారు తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు ఎంచుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, షిఫ్టుల్లో పనిచేసేవారు తమ పరిస్థితులకు అనుగుణంగా సమయాన్ని మార్చుకోవచ్చు.
ఏంటీ రూల్?
ఈ విధానంలో రోజులోని 24 గంటలను మూడు సమాన భాగాలుగా విభజించాలి. ఎనిమిది గంటలు నిద్రకు, ఎనిమిది గంటలు ఉద్యోగం లేదా పనికి కేటాయించాలి. మిగిలిన ఎనిమిది గంటలు వ్యాయామం, ఆహారం, కుటుంబంతో గడపడం, అభిరుచులు, విశ్రాంతి కోసం వినియోగించాలి. ఉత్పాదకతతో పాటు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలన్నదే దీని ఉద్దేశం. ఈ విధానాన్ని వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా మార్చుకుని పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రే ఆరోగ్యానికి బలం
ఈ మూడు భాగాల్లో నిద్రకు అత్యధిక ప్రాధాన్యం ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజుకు సుమారు ఎనిమిది గంటలు నిద్రపోతే శరీరం పునరుత్తేజం పొందుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. హార్మోన్లు సమతుల్యంగా పనిచేస్తాయి. మెదడు పనితీరు మెరుగుపడుతుంది. నిద్రలేమి వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.
పని.. పరిమితిలోనే మంచిది
ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఎనిమిది గంటల పని, మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని వెల్లడిస్తున్నారు. అయితే వైద్యులు, అత్యవసర సేవల సిబ్బంది, షిఫ్టుల్లో పనిచేసేవారికి ఈ సమయాన్ని కచ్చితంగా పాటించడం సాధ్యం కాకపోవచ్చని పేర్కొంటున్నారు. అలాంటి వారు వీలైనప్పుడల్లా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు.
మిగిలిన ఎనిమిది గంటలు ఇలా..
వ్యక్తిగత సమయాన్ని కేవలం విశ్రాంతికే పరిమితం చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమతుల ఆహారం తీసుకోవడం, కుటుంబంతో సమయం గడపడం, పుస్తకాలు చదవడం, ధ్యానం చేయడం, అభిరుచులకు సమయం కేటాయించడం ఆరోగ్యానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ఈ సమయాన్ని కూడా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం, వయసు, జీవనశైలికి అనుగుణంగా ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.
అందరికీ ఒకే సూత్రం కాదు
8-8-8 రూల్ను కచ్చితమైన నిబంధనగా కాకుండా ఓ మార్గదర్శకంగా చూడాలని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం ఉన్నవారు వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. కీళ్ల సమస్యలు ఉన్నవారు తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు ఎంచుకోవాలి. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు, షిఫ్టుల్లో పనిచేసేవారు తమ పరిస్థితులకు అనుగుణంగా సమయాన్ని మార్చుకోవచ్చు.