ఇండోనేషియాలోని ఈ హిందూ ఆలయానికి మోదీ ఎందుకు వెళ్లనున్నారు?
- ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయ సముదాయం ప్రంబనన్
- 9వ శతాబ్దంలో మతారం రాజవంశం ఆధ్వర్యంలో నిర్మాణం
- యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు
- శివ, విష్ణు, బ్రహ్మ ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ
- గోడలపై రామాయణ శిల్పాలు
- ఆలయ పునరుద్ధరణకు భారత్ సహకారం
ఇండోనేషియాలోని చారిత్రక ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి ఈ పర్యటన చేపట్టనున్నారు. భారత్, ఇండోనేషియా మధ్య శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంస్కృతిక బంధానికి ప్రతీకగా ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆలయ పునరుద్ధరణకు సహకరించే అంశంపై కూడా భారత్ తన ఆసక్తిని వెల్లడించే అవకాశం ఉంది.
ప్రంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది. 9వ శతాబ్దంలో మతారం రాజవంశం కాలంలో దీన్ని నిర్మించారు. ఒకప్పుడు ఇక్కడ మొత్తం 240 ఆలయాలు ఉండేవి. ప్రస్తుతం వాటిలో చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆలయ సముదాయం ఇప్పటికీ ఇండోనేషియా చారిత్రక సంపదలో కీలక స్థానాన్ని దక్కించుకుంది.
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆకర్షణ 47 మీటర్ల ఎత్తైన శివ మహాదేవాలయం. ప్రంబనన్లో ఇదే అత్యంత ఎత్తైన నిర్మాణం. దీనితో పాటు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడికి చెందిన మరో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. హిందూ ఆలయ నిర్మాణ కళకు ఇది అత్యుత్తమ ఉదాహరణగా గుర్తింపు పొందింది.
1991లో యునెస్కో ప్రంబనన్ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. గతంలో భూకంపాల కారణంగా ఆలయం దెబ్బతిన్నా తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆలయ గోడలపై భారత ఇతిహాసం రామాయణంలోని ఘట్టాలను అద్భుతంగా చెక్కారు. ఆలయం చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తూ వెళితే రామాయణ కథ మొత్తం కనిపించేలా శిల్పాలు రూపొందించారు.
పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రంబనన్ ఇప్పటికీ హిందువులకు ప్రముఖ ఆరాధనా కేంద్రంగానూ కొనసాగుతోంది. మహాశివరాత్రి వంటి పండుగల సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనతో భారత్, ఇండోనేషియా మధ్య సాంస్కృతిక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ పునరుద్ధరణలో భారత్ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య నాగరికతల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది.
ప్రంబనన్ ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ ఆలయ సముదాయంగా గుర్తింపు పొందింది. 9వ శతాబ్దంలో మతారం రాజవంశం కాలంలో దీన్ని నిర్మించారు. ఒకప్పుడు ఇక్కడ మొత్తం 240 ఆలయాలు ఉండేవి. ప్రస్తుతం వాటిలో చాలావరకు శిథిలావస్థలో ఉన్నాయి. అయినప్పటికీ ఈ ఆలయ సముదాయం ఇప్పటికీ ఇండోనేషియా చారిత్రక సంపదలో కీలక స్థానాన్ని దక్కించుకుంది.
ఈ ఆలయ సముదాయంలో ప్రధాన ఆకర్షణ 47 మీటర్ల ఎత్తైన శివ మహాదేవాలయం. ప్రంబనన్లో ఇదే అత్యంత ఎత్తైన నిర్మాణం. దీనితో పాటు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడికి చెందిన మరో రెండు ప్రధాన ఆలయాలు ఉన్నాయి. హిందూ ఆలయ నిర్మాణ కళకు ఇది అత్యుత్తమ ఉదాహరణగా గుర్తింపు పొందింది.
1991లో యునెస్కో ప్రంబనన్ను ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది. గతంలో భూకంపాల కారణంగా ఆలయం దెబ్బతిన్నా తర్వాత పునరుద్ధరణ పనులు చేపట్టారు. ఆలయ గోడలపై భారత ఇతిహాసం రామాయణంలోని ఘట్టాలను అద్భుతంగా చెక్కారు. ఆలయం చుట్టూ సవ్యదిశలో ప్రదక్షిణ చేస్తూ వెళితే రామాయణ కథ మొత్తం కనిపించేలా శిల్పాలు రూపొందించారు.
పర్యాటక కేంద్రంగా మాత్రమే కాకుండా ప్రంబనన్ ఇప్పటికీ హిందువులకు ప్రముఖ ఆరాధనా కేంద్రంగానూ కొనసాగుతోంది. మహాశివరాత్రి వంటి పండుగల సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఈ పర్యటనతో భారత్, ఇండోనేషియా మధ్య సాంస్కృతిక, వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆలయ పునరుద్ధరణలో భారత్ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య నాగరికతల అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే అవకాశముంది.