నాలుగో రోజూ లాభాల బాటలోనే స్టాక్‌ మార్కెట్లు

Stock markets continue gain for fourth consecutive day
  • సెన్సెక్స్‌కు 521 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం
  • రియాల్టీ, ఆటో షేర్లలో భారీ కొనుగోళ్లు
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్స్‌
  • నిఫ్టీకి 24,500–24,600 కీలక నిరోధ స్థాయి
  • 24,200, 24,000 స్థాయుల్లో కీలక మద్దతు
దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, ఆటో, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు బలంగా స్థిరపడ్డాయి.

సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 521.16 పాయింట్లు (0.67 శాతం) పెరిగి 78,285.07 వద్ద ముగిసింది. నిఫ్టీ 159.50 పాయింట్లు (0.66 శాతం) లాభపడి 24,430.35 వద్ద స్థిరపడింది.

నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేశాయి. కోటక్‌ మహీంద్రా, మ్యాక్స్‌ వెల్త్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 0.45 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 0.75 శాతం పెరిగాయి.

రంగాల వారీగా చూస్తే రియాల్టీ సూచీ ఆరు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఆటోమొబైల్ సూచీ నెల రోజుల గరిష్ఠాన్ని తాకగా, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ సూచీలు కూడా మంచి లాభాలు నమోదు చేశాయి.

సాంకేతికంగా నిఫ్టీకి 24,500–24,600 స్థాయి కీలక నిరోధంగా ఉందని, దానిని దాటితే మరింత ఎగబాకే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు 24,200 వద్ద తక్షణ మద్దతు, ఆ తర్వాత 24,000 స్థాయి కీలక మద్దతుగా ఉంటుందని తెలిపారు.
Stock Market
Sensex
Nifty 50
HDFC Bank
Indian Share Market
Realty Sector

More Telugu News