ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖ మత్స్యకారులందరూ సురక్షితం: మంత్రి అచ్చెన్నాయుడు
- ఒడిశా తీరంలో చిక్కుకున్న విశాఖపట్నం మత్స్యకారులు
- సాంకేతిక లోపంతో సముద్రంలో నిలిచిపోయిన బోటు
- 10 మందిని సురక్షితంగా కాపాడిన ఒడిశా మెరైన్ పోలీసులు
- ఏపీ ప్రభుత్వం చొరవతో వేగవంతమైన సహాయక చర్యలు
- మత్స్యకారులను స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు
తమ మత్స్యకారులు కష్టాల్లో ఉన్నారన్న సమాచారం అందిన వెంటనే ఏపీ ప్రభుత్వం తరఫున తాము వేగంగా స్పందించామని ఆయన వివరించారు. ఒడిశా మెరైన్ పోలీసులతో పాటు, అక్కడి మత్స్యశాఖ ఉన్నతాధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. ఏపీ ప్రభుత్వ చొరవ, ఒడిశా అధికారుల సహకారంతోనే ఈ ఆపరేషన్ విజయవంతమైందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి, తమ మత్స్యకారుల ప్రాణాలను కాపాడినందుకు ఒడిశా ప్రభుత్వానికి, మెరైన్ పోలీసులకు, మత్స్యశాఖ అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రక్షించబడిన మత్స్యకారులందరినీ వీలైనంత వేగంగా, సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి హామీ ఇచ్చారు. వారిని సురక్షితంగా వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో మత్స్యకార కుటుంబాలకు తమ కూటమి ప్రభుత్వం, అధికారులు అండగా నిలిచారని పేర్కొంటూ, వారికి అభినందనలు తెలియజేశారు. సకాలంలో స్పందించి, రెండు రాష్ట్రాల సమన్వయంతో ప్రాణనష్టం జరగకుండా నివారించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.