పసిడి ప్రియులకు కొంత ఊరట.. వరుసగా మూడో రోజు తగ్గుదల
- వరుసగా మూడో రోజు కూడా తగ్గిన బంగారం ధరలు
- తులం బంగారం ధర రూ.1.53 లక్షల కంటే దిగువకు పతనం
- అంతర్జాతీయ పరిణామాలు, దేశీయంగా డిమాండ్ తగ్గడమే ప్రధాన కారణం
- ఇటీవలి గరిష్ట స్థాయిల నుంచి గణనీయంగా దిగివచ్చిన పసిడి
- బంగారం బాటలోనే వెండి ధరలు కూడా తగ్గుముఖం
ఇక దేశంలోని ఇతర ప్రధాన నగరాల విషయానికి వస్తే.. చెన్నైలో ప్రస్తుతం 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,54,910గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,000గా ఉంది. ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్ద, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,000 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,55,910గా ఉంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,40,150 వద్ద కొనసాగుతోంది. నిన్న భారత మార్కెట్లో మేలిమి బంగారం సగటు ధర రికార్డు స్థాయిలో రూ.3,000 మేర తగ్గగా, వెండి ధరలోనూ రూ.10,000 మేర కోత పడింది.