భారత్లో 30 మిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వ.. యూఏఈతో కీలక ఒప్పందం
- భారత్లో 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వకు యూఏఈ అంగీకారం
- ప్రధాని మోదీ, యూఏఈ అధ్యక్షుడి మధ్య చర్చల అనంతరం కీలక నిర్ణయం
- వ్యూహాత్మక గ్యాస్ నిల్వలు, ఎల్పీజీ సరఫరాపైనా ఒప్పందాలు
- భారత్లో 5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టనున్న యూఏఈ
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య ఇంధన రంగ భాగస్వామ్యం మరింత బలపడింది. భారత వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాల్లో (స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్) 30 మిలియన్ బ్యారెళ్ల ముడిచమురును నిల్వ చేసేందుకు యూఏఈ అంగీకరించింది. ప్రధాని నరేంద్ర మోదీ అబుదాబి పర్యటన సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో జరిపిన చర్చల అనంతరం ఈ కీలక ఒప్పందం కుదిరినట్లు భారత విదేశాంగ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఈ ఒప్పందం భారత్ ఇంధన భద్రతకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL), అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) మధ్య కుదిరిన వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించారు.
ఇంధన రంగంలో యూఏఈ భారత్కు ఒక ముఖ్యమైన భాగస్వామి అని విదేశాంగ శాఖ పేర్కొంది. ముడిచమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలను కలుపుకొని సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కృషి చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా, భారత్లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను ఏర్పాటు చేయడంపైనా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కుదరడంపైనా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో ఇంధన రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ పలు ఒప్పందాలు కుదిరాయి. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ రంగాల్లో భారత్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ముందుకొచ్చింది. రక్షణ, నౌకా సహకారం, నౌకా నిర్మాణం, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లోనూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఈ ఒప్పందం భారత్ ఇంధన భద్రతకు మరింత బలాన్ని చేకూర్చనుంది. ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL), అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ (ADNOC) మధ్య కుదిరిన వ్యూహాత్మక సహకార ఒప్పందాన్ని ఇరు దేశాధినేతలు స్వాగతించారు.
ఇంధన రంగంలో యూఏఈ భారత్కు ఒక ముఖ్యమైన భాగస్వామి అని విదేశాంగ శాఖ పేర్కొంది. ముడిచమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలను కలుపుకొని సమగ్ర ఇంధన భాగస్వామ్యం కోసం కృషి చేయాలని ఇరుపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా, భారత్లో వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను ఏర్పాటు చేయడంపైనా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా ఒప్పందం కుదరడంపైనా నేతలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పర్యటనలో ఇంధన రంగంతో పాటు ఇతర రంగాల్లోనూ పలు ఒప్పందాలు కుదిరాయి. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ రంగాల్లో భారత్లో 5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ ముందుకొచ్చింది. రక్షణ, నౌకా సహకారం, నౌకా నిర్మాణం, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లోనూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలకు భద్రత కల్పించడం వంటి అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. యూఏఈపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.