పోక్సో కేసు: బండి భగీరథ్కు హైకోర్టులో చుక్కెదురు
- ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
- అరెస్టు నుంచి రక్షణపై వచ్చే వారం నిర్ణయం వెలువరిస్తామన్న న్యాయస్థానం
- అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సాగిన వాదనలు
- బాధితురాలి వాంగ్మూలం చూశాక ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టంచేసిన న్యాయమూర్తి
కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు పోక్సో కేసులో తెలంగాణ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం శుక్రవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘ విచారణ జరిపింది. ఈ దశలో ముందస్తు బెయిల్పై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని జస్టిస్ టి.మాధవీదేవి స్పష్టం చేశారు. అయితే, అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అంశంపై నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేశారు.
శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు ఇరుపక్షాల వాదనలను న్యాయమూర్తి విన్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దర్యాప్తునకు సహకరిస్తామని, అప్పటివరకూ అరెస్ట్ వంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు.
ఇరుపక్షాల వాదనలు
పిటిషనర్ను ఇరికించేందుకే కఠిన సెక్షన్లు చేర్చారని, ఇది ఇరుపక్షాల అంగీకారంతో ఉన్న సంబంధమని, అది బెడిసికొట్టడంతోనే ఈ కేసు పెట్టారని భగీరథ్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. అయితే, ప్రాసిక్యూషన్ వాదనలు దీనికి భిన్నంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్లలోపే ఉందని, ఆమె వాంగ్మూలం తర్వాత మరింత కఠినమైన పోక్సో సెక్షన్లు చేర్చామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు తెలిపారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు ఆరోపించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారంపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేయడంతో ఈ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది.
శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి దాదాపు 12 గంటల వరకు ఇరుపక్షాల వాదనలను న్యాయమూర్తి విన్నారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. దర్యాప్తునకు సహకరిస్తామని, అప్పటివరకూ అరెస్ట్ వంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు.
ఇరుపక్షాల వాదనలు
పిటిషనర్ను ఇరికించేందుకే కఠిన సెక్షన్లు చేర్చారని, ఇది ఇరుపక్షాల అంగీకారంతో ఉన్న సంబంధమని, అది బెడిసికొట్టడంతోనే ఈ కేసు పెట్టారని భగీరథ్ తరఫు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదించారు. అయితే, ప్రాసిక్యూషన్ వాదనలు దీనికి భిన్నంగా ఉన్నాయి. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం బాధితురాలి వయసు 18 ఏళ్లలోపే ఉందని, ఆమె వాంగ్మూలం తర్వాత మరింత కఠినమైన పోక్సో సెక్షన్లు చేర్చామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు తెలిపారు. నిందితుడి తండ్రి కేంద్ర మంత్రి కావడంతో బెదిరింపులకు పాల్పడ్డారని బాధితురాలి తరఫు న్యాయవాది పప్పు నాగేశ్వరరావు ఆరోపించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా తనపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారంపై న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయాన్ని వచ్చే వారానికి వాయిదా వేయడంతో ఈ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది.