కూలర్ ఆన్లో ఉండగా నీళ్లు పోస్తున్నారా? హైదరాబాద్లో ఏం జరిగిందో తెలిస్తే మళ్లీ అలా చేయరు!
- కూలర్లో నీళ్లు పోస్తూ వ్యక్తి మృతి
- ఏఎస్ రావు నగర్లో ఘటన
- కూలర్ ఆన్లో ఉండడం వల్లే ప్రమాదం
- వేసవిలో విద్యుత్ పరికరాలతో జాగ్రత్త
ఎయిర్ కూలర్లో నీళ్లు నింపుతుండగా కరెంట్ షాక్ తగిలి 54 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన ఘటన హైదరాబాద్లోని ఏఎస్ రావునగర్లో జరిగింది. మృతుడిని కృష్ణగా గుర్తించారు. కూలర్ ఆన్లో ఉండగానే అందులో నీళ్లు పోయడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
నీళ్లు పోస్తున్న సమయంలో కృష్ణకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా కేకలు వేశారు. అది విన్న కుటుంబ సభ్యులు గదిలోకి పరుగెత్తుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని చికిత్స కోసం వెంటనే దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణలో ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. మే 9న మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే తరహా ఘటనలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. బట్టలను ఇస్త్రీ చేసుకుంటుండగా కరెంట్ షాక్ తగిలి స్పృహ తప్పి పడిపోయారు.
ఇస్త్రీ పెట్టె వైరింగ్లో ఉన్న లోపం వల్లే షాక్ తగిలిందని పోలీసులు తెలిపారు. ఆయనను హాస్పిటల్కు తరలించినా ఫలితం దక్కలేదు. ఘటనపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలంలో విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
నీళ్లు పోస్తున్న సమయంలో కృష్ణకు ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో గట్టిగా కేకలు వేశారు. అది విన్న కుటుంబ సభ్యులు గదిలోకి పరుగెత్తుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన అతణ్ని చికిత్స కోసం వెంటనే దగ్గర్లోని హాస్పిటల్కు తరలించారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
తెలంగాణలో ఇలాంటి విద్యుత్ ప్రమాదాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. మే 9న మంచిర్యాల జిల్లాలో కూడా ఇదే తరహా ఘటనలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయారు. బట్టలను ఇస్త్రీ చేసుకుంటుండగా కరెంట్ షాక్ తగిలి స్పృహ తప్పి పడిపోయారు.
ఇస్త్రీ పెట్టె వైరింగ్లో ఉన్న లోపం వల్లే షాక్ తగిలిందని పోలీసులు తెలిపారు. ఆయనను హాస్పిటల్కు తరలించినా ఫలితం దక్కలేదు. ఘటనపై పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 194 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేసవి కాలంలో విద్యుత్ పరికరాలను వాడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.