మరోసారి ఆలోచించండి: ఓఎస్డీగా జ్యోతిష్యుడి నియామకంపై సీఎం విజయ్కి వీసీకే సూచన
- ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకం
- లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదన్న వీసీకే ప్రధాన కార్యదర్శి
- రాజకీయ సలహాలు ఇవ్వడానికి కూడా ఆమోదయోగ్యుడు కాదన్న సీపీఎం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా నియమించడంపై టీవీకే మిత్రపక్షం వీసీకే స్పందించింది. ఇప్పటికే ఈ నియామకంపై కాంగ్రెస్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జ్యోతిష్యుడిగా, టీవీకే పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వెట్రివేల్ను ఓఎస్డీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఈ నియామకంపై పునఃపరిశీలన చేయాలని వీసీకే ప్రధాన కార్యదర్శి డి.రవికుమార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ అశాస్త్రీయ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన మరో పోస్టులో డిమాండ్ చేశారు.
వెట్రివేల్ వంటి వ్యక్తిని ప్రభుత్వ ఖర్చుతో అధికారిగా నియమించడం ప్రజలలో జ్యోతిష్యంపై విశ్వాసాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రభుత్వం చేసిన ఈ నియామకం ఆమోదయోగ్యం కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి. షణ్ముగం పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ సలహాలు ఇవ్వడానికి కూడా ఆమోదయోగ్యుడు కాదని అభిప్రాయపడ్డారు.
లౌకిక ప్రభుత్వంలో ఇది ఆమోదయోగ్యం కాదని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఈ నియామకంపై పునఃపరిశీలన చేయాలని వీసీకే ప్రధాన కార్యదర్శి డి.రవికుమార్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ అశాస్త్రీయ నిర్ణయాన్ని తమిళనాడు ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన మరో పోస్టులో డిమాండ్ చేశారు.
వెట్రివేల్ వంటి వ్యక్తిని ప్రభుత్వ ఖర్చుతో అధికారిగా నియమించడం ప్రజలలో జ్యోతిష్యంపై విశ్వాసాన్ని పెంచడానికి మాత్రమే ఉపయోగపడుతుందని, ప్రభుత్వం చేసిన ఈ నియామకం ఆమోదయోగ్యం కాదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి. షణ్ముగం పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి రాజకీయ సలహాలు ఇవ్వడానికి కూడా ఆమోదయోగ్యుడు కాదని అభిప్రాయపడ్డారు.