భగవంతుని పిల్లలకు అండ... సత్తా చాటిన విద్యార్థికి పవన్ అభినందనలు
- పదో తరగతిలో 555 మార్కులు సాధించిన విద్యార్థి
- పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఆకుల పవన్ కుమార్
- పవన్ కల్యాణ్ జీతం నుంచి ఆర్థిక సాయం పొందుతున్నాడు
- విద్యార్థికి అభినందనలు తెలిపిన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం
తాను అందిస్తున్న ఆర్థిక చేయూతతో ఒక విద్యార్థి ఉన్నత ప్రతిభ కనబరచడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన విద్యార్థి ఆకుల పవన్ కుమార్ 555 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు.
యు. కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన జీతం నుంచి వ్యక్తిగతంగా అందిస్తున్న ఆర్థిక సాయం అందుకుంటున్నాడు. "భగవంతుని పిల్లలు (తల్లిదండ్రులు లేని పిల్లలు)" పేరుతో కొందరిని ఎంపిక చేసి, వారికి ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థికంగా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందంలోని పవన్ కుమార్ పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అభినందనలు తెలియజేసింది.
పవన్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయనకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని పవన్ కల్యాణ్ తరపున ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తన నియోజకవర్గంలోని విద్యార్థి విజయం పట్ల పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
యు. కొత్తపల్లి మండలం, కొత్త ఇసుకపల్లి గ్రామానికి చెందిన పవన్ కుమార్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన జీతం నుంచి వ్యక్తిగతంగా అందిస్తున్న ఆర్థిక సాయం అందుకుంటున్నాడు. "భగవంతుని పిల్లలు (తల్లిదండ్రులు లేని పిల్లలు)" పేరుతో కొందరిని ఎంపిక చేసి, వారికి ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున పవన్ కల్యాణ్ ఆర్థికంగా అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ బృందంలోని పవన్ కుమార్ పదో తరగతిలో మంచి మార్కులు సాధించడంపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అభినందనలు తెలియజేసింది.
పవన్ కుమార్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయనకు ఎల్లప్పుడూ తన సహకారం ఉంటుందని పవన్ కల్యాణ్ తరపున ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. తన నియోజకవర్గంలోని విద్యార్థి విజయం పట్ల పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది.