Tim David: టిమ్ డేవిడ్, పటీదార్ సిక్సర్ల మోత... ఆర్సీబీ కళ్లు చెదిరే స్కోరు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో టిమ్ డేవిడ్ (70*), కెప్టెన్ రజత్ పటీదార్ (48*) సృష్టించిన విధ్వంసంతో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం సిక్సర్ల వర్షంతో తడిసి ముద్దయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణయం పూర్తిగా బెడిసికొట్టింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (46), విరాట్ కోహ్లీ (28) పరుగులు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (50) అద్భుతమైన హాఫ్ సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే, 14.1 ఓవర్లలో 151 పరుగుల వద్ద పడిక్కల్ ఔటైన తర్వాత అసలు విధ్వంసం మొదలైంది. కెప్టెన్ రజత్ పటీదార్, టిమ్ డేవిడ్ చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
మైదానంలో ఏ బౌలర్ బౌలింగ్ చేసినా బంతి బౌండరీ లైన్ దాటాల్సిందే అన్నట్టుగా వీరిద్దరూ చెలరేగారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆడిన తీరుకు స్టేడియం హోరెత్తింది. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న డేవిడ్, 3 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 280.00గా నమోదైంది. మరోవైపు, కెప్టెన్గా బాధ్యతాయుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటీదార్, కేవలం 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ దెబ్బకు చెన్నై బౌలర్లందరూ తేలిపోయారు. అన్షుల్ కంబోజ్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇవ్వగా, జామీ ఓవర్టన్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆర్సీబీ తమ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లలో ఒకదాన్ని నమోదు చేసి, చెన్నై ముందు 251 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి మంచి ఆరంభమే లభించింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (46), విరాట్ కోహ్లీ (28) పరుగులు చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (50) అద్భుతమైన హాఫ్ సెంచరీతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే, 14.1 ఓవర్లలో 151 పరుగుల వద్ద పడిక్కల్ ఔటైన తర్వాత అసలు విధ్వంసం మొదలైంది. కెప్టెన్ రజత్ పటీదార్, టిమ్ డేవిడ్ చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు.
మైదానంలో ఏ బౌలర్ బౌలింగ్ చేసినా బంతి బౌండరీ లైన్ దాటాల్సిందే అన్నట్టుగా వీరిద్దరూ చెలరేగారు. ముఖ్యంగా టిమ్ డేవిడ్ ఆడిన తీరుకు స్టేడియం హోరెత్తింది. కేవలం 25 బంతులు ఎదుర్కొన్న డేవిడ్, 3 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 280.00గా నమోదైంది. మరోవైపు, కెప్టెన్గా బాధ్యతాయుతమైన మెరుపు ఇన్నింగ్స్ ఆడిన రజత్ పటీదార్, కేవలం 19 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 48 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్కు కేవలం 35 బంతుల్లోనే 99 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ జోడీ దెబ్బకు చెన్నై బౌలర్లందరూ తేలిపోయారు. అన్షుల్ కంబోజ్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇవ్వగా, జామీ ఓవర్టన్ 3 ఓవర్లలో 42 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆర్సీబీ తమ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లలో ఒకదాన్ని నమోదు చేసి, చెన్నై ముందు 251 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది.