MS Dhoni: చెన్నైకి బిగ్ షాక్.. ఐపీఎల్కు ధోనీ దూరం
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) అభిమానులకు నిరాశ కలిగించే వార్త. ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనీ గాయం కారణంగా టోర్నమెంట్లోని మొదటి రెండు వారాలకు దూరమయ్యాడు. పిక్క కండరాల నొప్పితో బాధపడుతున్న ధోనీకి విశ్రాంతి అవసరమని, ప్రస్తుతం అతను రిహాబిలిటేషన్లో ఉన్నాడని ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.
ఐపీఎల్ 19వ ఎడిషన్ ఇవాళ ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం గువాహటిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ కీలక మ్యాచ్కు ముందే ధోనీ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. "ఎంఎస్ ధోనీ పిక్క కండరాల గాయం నుంచి కోలుకుంటున్నారు. ఫలితంగా అతను ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరమయ్యే అవకాశం ఉంది" అని సీఎస్కే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందే, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను సీఎస్కే పంచుకుంది. ఆ వీడియోలో 44 ఏళ్ల ధోనీ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. అలవోకగా భారీ షాట్లు ఆడుతూ బంతిని చాలాసార్లు బౌండరీ దాటించాడు. ఆ వీడియో చూసిన అభిమానులు ఈ సీజన్లో ధోనీ మెరుపులు ఖాయమని భావిస్తున్న తరుణంలో గాయం వార్త వారిని నిరాశపరిచింది. ధోనీ గైర్హాజరీలో వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజు శాంసన్ స్వీకరించే అవకాశం ఉంది.
ఈ సీజన్లో ఆటగాళ్ల ట్రేడింగ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ను సీఎస్కే తీసుకుంది. అదే సమయంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్లను వదులుకుంది. వీరిలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ మరో గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పుడు సీఎస్కే తమ తొలి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుండటం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు రాజస్థాన్ కెప్టెన్గా ఉన్న శాంసన్ ఇప్పుడు సీఎస్కే తరఫున ఆడుతుండగా, సీఎస్కే కీలక ఆటగాడిగా ఉన్న జడేజా రాజస్థాన్ జట్టులో చేరాడు. దీంతో వీరిద్దరూ తమ మాజీ జట్లపై తలపడనుండటం ఈ మ్యాచ్పై అంచనాలను మరింత పెంచింది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే, తమ ఆరో టైటిల్ వేటను ధోనీ లేకుండా ఎలా ప్రారంభిస్తుందో చూడాలి.
ఐపీఎల్ 19వ ఎడిషన్ ఇవాళ ప్రారంభం కానుండగా, చెన్నై సూపర్ కింగ్స్ సోమవారం గువాహటిలోని బర్సపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ కీలక మ్యాచ్కు ముందే ధోనీ దూరం కావడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. "ఎంఎస్ ధోనీ పిక్క కండరాల గాయం నుంచి కోలుకుంటున్నారు. ఫలితంగా అతను ఐపీఎల్ 2026 తొలి రెండు వారాలకు దూరమయ్యే అవకాశం ఉంది" అని సీఎస్కే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది.
ఈ ప్రకటన వెలువడటానికి కొన్ని గంటల ముందే, చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోను సీఎస్కే పంచుకుంది. ఆ వీడియోలో 44 ఏళ్ల ధోనీ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. అలవోకగా భారీ షాట్లు ఆడుతూ బంతిని చాలాసార్లు బౌండరీ దాటించాడు. ఆ వీడియో చూసిన అభిమానులు ఈ సీజన్లో ధోనీ మెరుపులు ఖాయమని భావిస్తున్న తరుణంలో గాయం వార్త వారిని నిరాశపరిచింది. ధోనీ గైర్హాజరీలో వికెట్ కీపింగ్ బాధ్యతలను సంజు శాంసన్ స్వీకరించే అవకాశం ఉంది.
ఈ సీజన్లో ఆటగాళ్ల ట్రేడింగ్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజూ శాంసన్ను సీఎస్కే తీసుకుంది. అదే సమయంలో ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, శామ్ కరన్లను వదులుకుంది. వీరిలో ఇంగ్లండ్ ఆల్రౌండర్ శామ్ కరన్ మరో గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్కు పూర్తిగా దూరమయ్యాడు. ఇప్పుడు సీఎస్కే తమ తొలి మ్యాచ్ను రాజస్థాన్ రాయల్స్తో ఆడనుండటం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు రాజస్థాన్ కెప్టెన్గా ఉన్న శాంసన్ ఇప్పుడు సీఎస్కే తరఫున ఆడుతుండగా, సీఎస్కే కీలక ఆటగాడిగా ఉన్న జడేజా రాజస్థాన్ జట్టులో చేరాడు. దీంతో వీరిద్దరూ తమ మాజీ జట్లపై తలపడనుండటం ఈ మ్యాచ్పై అంచనాలను మరింత పెంచింది. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన సీఎస్కే, తమ ఆరో టైటిల్ వేటను ధోనీ లేకుండా ఎలా ప్రారంభిస్తుందో చూడాలి.