Rinku Singh: రేపు వెస్టిండీస్ తో భారత్ మ్యాచ్... నేడు జట్టుతో కలవనున్న రింకూ సింగ్

Rinku Singh to Join India Squad for West Indies Match
  • తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకున్న రింకూ సింగ్
  • నేడు కోల్‌కతాలో టీమిండియా జట్టులో చేరనున్న వైనం
  • రేపు వెస్టిండీస్‌తో భారత్ కీలక సూపర్ 8 మ్యాచ్
  • గెలిచిన జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత 
  • రింకూ జట్టులో చేరతాడని ధ్రువీకరించిన బీసీసీఐ వర్గాలు
టీమిండియా యువ క్రికెటర్ రింకూ సింగ్, తండ్రి అంత్యక్రియలు పూర్తి చేసుకుని తిరిగి జట్టు విధుల్లో చేరనున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరగనున్న అత్యంత కీలకమైన సూపర్ 8 మ్యాచ్ కోసం, అతను శనివారం (నేడు) కోల్‌కతాలో జట్టు శిబిరంలో చేరనున్నట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి. 

రింకూ సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్‌తో బాధపడుతూ శుక్రవారం గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషయం తెలియగానే రింకూ తన స్వగ్రామం అలీగఢ్‌కు వెళ్లి తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. వ్యక్తిగత విషాదం నుంచి తేరుకుని, దేశం కోసం ఆడేందుకు అతను సిద్ధమయ్యాడు. 

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం (మార్చి 1) భారత్, వెస్టిండీస్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు ‘డూ ఆర్ డై’ లాంటిది. ఇందులో గెలిచిన జట్టు సెమీ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 
 
Rinku Singh
India vs West Indies
T20 World Cup
Indian Cricket Team
KhanChand Singh
Eden Gardens
Kolkata
Super 8 Match
Cricket
Liver Cancer

More Telugu News