అస్సాంలో దారుణం: మహిళపై సామూహిక అత్యాచారం చేసి, డబ్బులు లాక్కున్న దుండగులు

Assam Gang Rape Seven Arrested Two in Kachar District
అస్సాంలోని కచార్ జిల్లాలో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. 28 ఏళ్ల మహిళపై ఏడుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాకుండా, ఆమె నుంచి బలవంతంగా డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ దారుణం ఈ నెల 19న సిల్చార్ పట్టణ సమీపంలోని బైపాస్ రోడ్డులో జరిగింది.

బాధితురాలు తన ప్రియుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఎస్‌యూవీలో వచ్చిన ఏడుగురు వ్యక్తులు వారిని అడ్డగించారు. అనంతరం యువకుడి ముందే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, బాధితురాలిని బెదిరించి, ఆమె ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఖాతాకు రూ.10,000 బదిలీ చేయించుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) కింద గ్యాంగ్ రేప్, దోపిడీ, బెదిరింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నిలోత్పల్ దాస్ అనే వ్యక్తితో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్టు కచార్ జిల్లా పోలీసులు తెలిపారు. "మిగిలిన ఐదుగురు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం. వారి ఆచూకీపై మాకు కీలక ఆధారాలు లభించాయి" అని అదనపు ఎస్పీ రజత్ కుమార్ పాల్ వెల్లడించారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.
Go Back to Shorts
Assam Gang Rape
Kachar district
Silchar
Gang Rape Case
Assam Crime
Sexual Assault
India Crime
Nilotpal Das
Assam Police
Crime news

More Telugu News