హుస్సేన్‌సాగర్‌లో దూకేందుకు యత్నం.. తల్లి, ఇద్దరు పిల్లలను కాపాడిన పోలీసులు

Hyderabad Police Save Woman Two Children From Suicide Attempt at Hussain Sagar
షార్ట్స్‌లో చూడండి
కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళ తన ఇద్దరు కుమారులతో కలిసి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారిని కాపాడారు. ఈ ఘటన హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే.. జియాగూడ ఎంసీహెచ్ కాలనీకి చెందిన బి.ప్రతివ (28), తన కుమారులు అనిష్ (10), జస్వంత్ (7)తో కలిసి ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద వారు అనుమానాస్పదంగా కనిపించడంతో గస్తీలో ఉన్న పోలీసులు వారిని ప్రశ్నించారు. విచారణలో, కుటుంబంలో భర్తతో తరచూ గొడవలు జరుగుతున్నాయని, దీంతో విసిగిపోయి పిల్లలతో కలిసి హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పోలీసులకు తెలిపింది. 

వెంటనే స్పందించిన పోలీసులు తల్లీకుమారులను సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య ఆమె సమస్యలను అడిగి తెలుసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం, తదుపరి చర్యల నిమిత్తం వారిని కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ముగ్గురి ప్రాణాలు నిలిచాయి. 
Go Back to Shorts
Prathiva
Hyderabad
Hussain Sagar
Tank Bund
Suicide Attempt
Family Problems
Telangana
Police Rescue
Kulsampura Police Station
Ziyaguda

More Telugu News