కాంగ్రెస్ ప్రభంజనం ఖాయం... ఓటర్లు మావైపే నిలిచారు: మహేశ్ కుమార్ గౌడ్
- మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ ధీమా
- సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనకే ప్రజల మద్దతు అని వెల్లడి
- ఆరు గ్యారంటీల అమలు సానుకూలంగా పనిచేసిందన్న మహేశ్ గౌడ్
- పట్టణ ఓటర్లు కాంగ్రెస్ వైపే ఉన్నారని స్పష్టం
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ సరళిని గమనిస్తే అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో నిలవబోతోందని మహేశ్ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ప్రజా పాలనకు, సంక్షేమ పథకాలకు పట్టణ ఓటర్లు మద్దతు పలికారని ఆయన వివరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉందని, ఈ ఫలితాలతో అది నిరూపితమవుతుందని తెలిపారు.
ఆరు గ్యారంటీల అమలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు ప్రజల ఆదరణ చూరగొన్నాయని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం సానుకూల ఫలితాలను ఇస్తుందని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం శ్రమించిన ప్రతి కార్యకర్తకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.