Pawan Kalyan: వచ్చేసింది 'ఉస్తాద్..' ఫస్ట్ సింగిల్... 'దేఖ్ లేంగే సాలా' అంటున్న పవన్ కల్యాణ్
- పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్'
- నేడు తొలి పాట విడుదల
- సోషల్ మీడియాలో ట్రెండింగ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తొలి పాట విడుదలైంది. 'దేఖ్ లేంగే సాలా' అంటూ సాగే ఈ పవర్ఫుల్ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఈ పాట విడుదలైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. బాలీవుడ్ గాయకుడు విశాల్ దద్లానీ, హరిప్రియ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. శ్రోతల్లో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి నింపేలా ఈ పాటను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో మంచి వ్యూస్తో దూసుకుపోతోంది.
ఈ పాట విడుదలకు ముందు చిత్రబృందం ఒక వినూత్న ప్రచారానికి తెరలేపింది. తెలుగు సినిమాలో తొలిసారిగా లక్ష మంది అభిమానులతో పాట లిరిక్ షీట్ను విడుదల చేయించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో అభిమానులు పాల్గొని, ఈ లిరిక్ షీట్ను ఆవిష్కరించారు. అనుకున్న సమయం కంటే వేగంగా లక్ష ఎంట్రీలు రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయనాంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటకు ప్రముఖ గేయరచయిత భాస్కరభట్ల సాహిత్యం అందించారు. బాలీవుడ్ గాయకుడు విశాల్ దద్లానీ, హరిప్రియ తమ గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. శ్రోతల్లో ఆత్మవిశ్వాసం, స్ఫూర్తి నింపేలా ఈ పాటను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్లో మంచి వ్యూస్తో దూసుకుపోతోంది.
ఈ పాట విడుదలకు ముందు చిత్రబృందం ఒక వినూత్న ప్రచారానికి తెరలేపింది. తెలుగు సినిమాలో తొలిసారిగా లక్ష మంది అభిమానులతో పాట లిరిక్ షీట్ను విడుదల చేయించింది. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లో అభిమానులు పాల్గొని, ఈ లిరిక్ షీట్ను ఆవిష్కరించారు. అనుకున్న సమయం కంటే వేగంగా లక్ష ఎంట్రీలు రావడంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అయనాంకా బోస్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.