కోనసీమ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు

Chandrababu Naidu Reacts to Konaseema Incident Announces 15 Lakh Compensation
కోనసీమ జిల్లాలో జరిగిన ఘోర బాణసంచా పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో హోంమంత్రి అనిత, ఉన్నతాధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రమాదానికి గల కారణాలు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా అధికారులు ఘటనపై రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. ప్రమాదం జరిగిన యూనిట్‌లో నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారని నివేదికలో స్పష్టం చేశారు. ఒకే షెడ్డులో 14 మంది కార్మికులు ముడి పదార్థాలను తయారు చేస్తున్నారని, కఠినమైన మెటీరియల్ వాడటం వల్ల స్పార్క్ వచ్చి పేలుడు సంభవించిందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, బాణసంచా తయారీ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు పలు మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రతి తయారీ కేంద్రంలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వాటిని కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ముడి పదార్థాల కొనుగోళ్లను ఇకపై ఆన్‌లైన్ ద్వారానే జరపాలని, దీనివల్ల పారదర్శకతతో పాటు నియంత్రణ కూడా ఉంటుందని సూచించారు. నిబంధనలు పాటించని, అనధికారికంగా నడుస్తున్న యూనిట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే నిర్వాహకులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని తేల్చిచెప్పారు.

అంతేకాకుండా, లైసెన్సులు జారీ చేసే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సీఎం సూచించారు. పనిచేసే ప్రతీ కార్మికుడికి వ్యక్తిగత బీమా సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu Naidu
Konaseema fire accident
Andhra Pradesh
firecrackers factory explosion
ex gratia
accident compensation
fire safety regulations
PD Act
online raw materials purchase
firecracker unit inspection

More Telugu News