Srilekha: వివాదాసప్పద ఆర్డీవో శ్రీలేఖను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government Transfers Controversial RDO Srilekha
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నం రెవెన్యూ శాఖలో ఇద్దరు కీలక అధికారుల మధ్య రాజుకున్న వివాదం తీవ్రస్థాయికి చేరడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. పరస్పర ఆరోపణలతో వార్తల్లోకెక్కిన విశాఖ ఆర్డీఓ పి. శ్రీలేఖ, డీఆర్వో బీహెచ్. భవానీ శంకర్‌లపై బదిలీ వేటు వేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కొంతకాలంగా ఈ ఇద్దరు అధికారుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం, డీఆర్వో భవానీ శంకర్ తహసీల్దార్ కార్యాలయాల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆర్డీఓ శ్రీలేఖ నేరుగా జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. మరోవైపు, పెందుర్తి మండలంలో ఓ విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఆర్డీఓ శ్రీలేఖకు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ పరస్పర ఆరోపణలతో వివాదం బహిర్గతం కావడంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

సోమవారం రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. శ్రీలేఖ, భవానీ శంకర్‌లను వెంటనే బాధ్యతల నుంచి తప్పించి, జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వారి స్థానంలో కొత్త అధికారులను కూడా నియమించింది. హెచ్‌బీసీఎల్ భూసేకరణ విభాగం డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఎస్. విద్యాసాగర్‌ను విశాఖ కొత్త ఆర్డీఓగా నియమించారు. డీఆర్వో బాధ్యతలను జిల్లా జాయింట్ కలెక్టర్ కె. మయూర అశోక్‌కు అదనంగా అప్పగించారు.

అధికారుల మధ్య వివాదాలు పరిపాలనపై ప్రభావం చూపకుండా, ప్రజలకు సేవలు అందించడంలో ఆటంకాలు కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీల వ్యవహారం విశాఖ జిల్లా రెవెన్యూ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Srilekha
Visakhapatnam
Bhavani Shankar
AP government
RDO transfer
Revenue department
Andhra Pradesh
Controversy
Show cause notice
HBCL

More Telugu News