Chandrababu Naidu: ఈ నెల 19న ఏపీ కేబినెట్ భేటీ

Chandrababu Naidu to Chair AP Cabinet Meeting on June 19
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 19న జరగనుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి అంతస్తులో గల సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో, 17వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు అన్ని శాఖల కార్యదర్శులు కేబినెట్ సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని ఆదేశించారు. ఈ నెల 4న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

కాగా, మంత్రివర్గ సమావేశాలను నెలకు రెండుసార్లు నిర్వహించాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెలలో రెండవ సమావేశం 19వ తేదీన నిర్వహించనున్నారు. ఈ నెల 21న విశాఖలో నిర్వహించే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నందున, అందుకు ముందుగానే కేబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి ఏపీ పర్యటన, రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, త్వరలో అమలు చేయనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు మొదలైన ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. 

.
Go Back to Shorts
Chandrababu Naidu
Andhra Pradesh Cabinet
AP Cabinet Meeting
Velagapudi Secretariat
Talli ki Vandanam
Annadata Sukhibhava
Narendra Modi
Visakhapatnam Yoga Day
AP Government Schemes
Andhra Pradesh News

More Telugu News