India: పాకిస్థాన్కు భారత్ షాక్ మీద షాక్

- పాక్ మీడియా కంటెంట్పై భారత్ నిషేధం
- ఓటీటీల్లో పాక్ సిరీస్లు బంద్
- జాతీయ భద్రతే ముఖ్యమన్న కేంద్రం
- పాక్ వెబ్ సిరీస్లపై నిషేధం
- భారత్లో పాక్ కంటెంట్పై వేటు
దేశ భద్రత దృష్ట్యా భారత ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్థాన్లో రూపొందిన మీడియా ప్రసారాలపై భారత్లో నిషేధం విధిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
జాతీయ భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటీటీ వేదికలతో పాటు, ఇతర డిజిటల్ మీడియా మాధ్యమాల్లో ప్రసారమయ్యే పాకిస్థానీ వెబ్సిరీస్లు, సినిమా పాటలు, పాడ్కాస్ట్ల వంటి కంటెంట్ను తక్షణమే నిలిపివేయాలని కేంద్రం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ నిషేధాజ్ఞలు వెంటనే అమల్లోకి వస్తాయని, సంబంధిత వేదికలు దీన్ని కచ్చితంగా పాటించాలని సూచించింది. ఇకపై భారతీయ ప్రేక్షకులు పాకిస్థానీ కంటెంట్ను అధికారికంగా వీక్షించే వీలుండదు.