Jagan Mohan Reddy: ఉగ్రదాడిలో ఏపీ వాసుల మరణాలపై జగన్ దిగ్భ్రాంతి

Jagan expresses grief over AP residents deaths in JK terror attack

  • జమ్ముకశ్మీర్ ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం
  • ముష్కరుల దాడిని తీవ్రంగా ఖండించిన జగన్
  • బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలవాలని విన్నపం

జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిలో 28 మంది దుర్మరణం పాలయ్యారు. మతం గురించి అడిగి మరీ ముష్కరులు కాల్చి చంపారు. ఈ ఘటనపై యావత్ ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఈ అమానుష ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

మ‌ృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ముష్కరుల దాడిని జగన్ తీవ్రంగా ఖండించారు. పర్యాటకులను అమానవీయంగా చంపేశారని అన్నారు. ఏపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవడం మనసును కలచివేస్తోందని చెప్పారు. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.

Jagan Mohan Reddy
Jammu and Kashmir Terrorist Attack
AP Victims
Terrorism in India
YCP
India Terror Attack
Kashmir Attack
Jagan Condemns Attack
  • Loading...

More Telugu News