Delhi Capitals: ఐపీఎల్: ఐదు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసిన ఢిల్లీ

- అభిషేక్ పోరెల్ అర్ధ సెంచరీ మిస్
- పర్వాలేదనిపించిన కేఎల్ రాహుల్, స్టబ్స్
- 189 పరుగుల లక్ష్యంతో దూకుడుగా ఆడుతున్న రాజస్థాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతోన్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. తద్వారా రాజస్థాన్ రాయల్స్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అభిషేక్ పోరెల్ (49) అర్ధ సెంచరీకి చేరువలో నిష్క్రమించాడు. కేఎల్ రాహుల్ 38, స్టబ్స్ 34 (నాటౌట్) పరుగులు చేసి జట్టుకు కొంతమేర సహకరించారు. మిగిలిన బ్యాట్స్ మెన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు తీయగా, మహీశ్ తీక్షణ, హసరంగ చెరో వికెట్ పడగొట్టారు.
సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ (20వ ఓవర్)లో ఎక్కువ వైడ్ బంతులు వేయడం ద్వారా పరుగులు సమర్పించుకున్నాడు. మొదటి బంతికి ఒక వైడ్, రెండో బంతికి మూడు వైడ్లు, ఒక నోబాల్ వేయడంతో పాటు నాలుగు పరుగులు ఇచ్చాడు. మూడో బంతికి స్టబ్స్ సిక్స్ కొట్టాడు.
ఐపీఎల్లో ఒక ఓవర్లో అత్యధిక బంతులు విసిరిన బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ (2023), తుషార్ (2023), శార్దూల్ ఠాకూర్ (2025), సందీప్ శర్మ (2025) ఉన్నారు. ఈ బౌలర్లు వైడ్లు, నోబాల్స్తో ఒక్కో ఓవర్లో 11 బంతులు వేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 3 ఓవర్లలో 35 పరుగులు చేసింది. రాజస్థాన్ రాయల్స్ దూకుడుగా ఆడుతోంది.