పార్లమెంట్ లో రేపు ఛావా సినిమా ప్రదర్శన
--
గురువారం ‘ఛావా’ సినిమా ప్రదర్శన ఉంటుందని, ఎంపీలందరూ తప్పకుండా హాజరుకావాలని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమా కారణంగానే ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని ఇటీవల ఆందోళనలు జరిగాయని, నాగ్ పూర్ లో హింస చెలరేగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైనటువంటి సినిమాను పార్లమెంటులో ప్రదర్శించడమేంటని ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘ఛావా’ సినిమా ప్రదర్శనను ప్రతిపక్ష ఎంపీలు బాయ్ కాట్ చేయనున్నట్లు సమాచారం.