అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలుగువారు మృతి
--
ఆదివారం రోహిత్ రెడ్డి ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లారు. భార్యాపిల్లలతో పాటు అత్త సునీతతో కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో ఉన్న ప్రణీత, ఆమె కొడుకు హర్వీన్, సునీతలు స్పాట్ లోనే చనిపోయారు. కారు నడుపుతున్న రోహిత్ రెడ్డితో పాటు చిన్న కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించాయి. కాగా, ఈ ప్రమాదంతో టేకులపల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి.