విశాఖలో ఎన్నారై టెక్కీ రోజా అనుమానాస్పద మృతి

NRT Techie Roja died in Visakha
విశాఖలో ఓ ఎన్నారై యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. రోజా అనే యువతి అమెరికాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. తన మిత్రుడు శ్రీధర్ ను కలిసేందుకు ఆమె ఏపీలోని విశాఖపట్నం వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ హోటల్ లో బస చేసిన ఆమె... స్నానం చేసేందుకు బాత్రూంకి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో శ్రీధర్ ఈ విషయాన్ని పోలీసులకు ఫోన్ ద్వారా తెలిపాడు. 

అయితే ఈ వ్యవహారంలో అనుమానాలున్నప్పటికీ, ప్రాథమికంగా ఆత్మహత్య కేసు నమోదు చేసినట్టు విశాఖ కమిషనర్ శంఖబ్రత బాగ్చి తెలిపారు. రోజా స్నేహితుడు శ్రీధర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Techie Roja
Death
Visakhapatnam
Police

More Telugu News