కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజాసింగ్ సంచలన ఆరోపణలు
- ప్రజలను రక్షించాల్సిన పోలీసులే లంచం తీసుకుంటూ పట్టుబడుతున్నారన్న రాజాసింగ్
- పోలీసు అధికారుల ఛాంబర్లలో కెమెరాలు పెట్టాలని సూచన
- లంచాలు తీసుకుంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శ
లంచం తీసుకుంటున్న ఘటనలు ఎన్నో బయటకు వస్తున్నాయని, కానీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అవినీతిరహిత పాలనను అందిస్తామని మాత్రం హామీ ఇవ్వలేకపోతోందని ఎద్దేవా చేశారు.