ఏపీని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేస్తున్నారు: డీకే అరుణ
- విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ
- కుటుంబ సమేతంగా వచ్చామని వెల్లడి
- రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు జరగాలని కోరుకున్నానన్న అరుణ
ఎన్నికలు అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలనుకున్నామని... అయితే, ఆ సమయంలో వరదలు రావడంతో ఇక్కడకు రావడం ఆలస్యమయిందని డీకే అరుణ చెప్పారు. అమ్మవారు విజయానికి ప్రతీక అని... తనకు కూడా మంచి విజయాన్ని అందించారని అన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనానికి వచ్చామని తెలిపారు. తెలుగు వారు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ... అందరికీ మంచి జరగాలని కోరుకున్నానని చెప్పారు. గతం కంటే అమ్మవారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు.