అండర్-19 ఆసియా కప్... రాణించిన పాక్ బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 282 రన్స్
- దుబాయి వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్
- 50 ఓవర్లలో 7 వికెట్లకు 281 పరుగులు చేసిన పాక్
- భారీ సెంచరీతో అదరగొట్టిన పాక్ ఓపెనర్ షాజైబ్ ఖాన్ (159)
అయితే, ఉస్మాన్ ఖాన్ వికెట్ కోల్పోయిన తర్వాత పాక్ వరుస విరామాల్లో వికెట్లు పారేసుకుంది. కానీ, త్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ మరో ఎండ్లో షాజైబ్ క్రీజులో పాతుకుపోయి జట్టు భారీ స్కోర్ చేయడం కీలకంగా వ్యహరించాడు. భారీ సెంచరీ (159)తో పాక్ను ఆదుకున్నాడు.
చివరికి పాకిస్థాన్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 రన్స్ చేసింది. టీమిండియాకు 282 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బౌలర్లలో సమర్థ్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు తీయగా... గుహ, కిరణ్ తలో వికెట్ పడగొట్టారు.