పాకిస్థాన్కు ఊహించని షాక్.. జింబాబ్వే చేతిలో పరాభవం
- పాకిస్థాన్ను 80 పరుగుల తేడాతో ఓడించిన జింబాబ్వే
- డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం జింబాబ్వేను వరించిన విజయం
- సికిందర్ రజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు
అనంతరం 206 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్ 21 ఓవర్లలో 60 రన్స్ చేసి 6 వికెట్లు కోల్పోయింది. అదే సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆపై వాతావరణం ఆటకు అనుకూలించలేదు. దాంతో 21 ఓవర్ల వద్ద జింబాబ్వే 125/7 స్థితిలో ఉండటంతో డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం విజయాన్ని నిర్ణయించారు.
దీంతో డీఎల్ఎస్ ప్రకారం జింబాబ్వే 80 రన్స్ తేడాతో గెలిచింది. 39 పరుగులు చేసి, 2 వికెట్లు తీసిన సికిందర్ రజాకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.