ఏపీలో నేడు వరద బాధితులకు పరిహారం చెల్లింపులు
- భారీ వర్షాలు, బుడమేరు వరదలకు విజయవాడ అతలాకుతలం
- వరద బాధితులకు ఇప్పటికే పరిహారం ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
- విజయవాడ కలెక్టరేట్ నుండి నేడు పరిహారం చెల్లింపును ప్రారంభించనున్న సీఎం
ఈ క్రమంలో 10 రోజులు పాటు విజయవాడ కలెక్టరేట్ లోనే సీఎం చంద్రబాబు మకాం వేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందేలా యంత్రాంగాన్ని నడిపించారు. బాధితులకు నష్టపరిహారం అందజేయడానికి ప్రభుత్వం ఎన్యుమరేషన్ పూర్తి చేసింది. నష్టపరిహారం ప్యాకేజీని సీఎం చంద్రబాబునాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్యాకేజీ ప్రకారం వరదల్లో నష్టపోయిన బాధితులకు ఈరోజు (బుధవారం) ముఖ్యమంత్రి పరిహారం విడుదల చేయనున్నారు. అర్హులైన బాధితులందరికీ నేరుగా వారి ఖాతాల్లోకే పరిహారం డబ్బులు జమ చేయనున్నారు.