త్వరలోనే 'ఆపరేషన్ బుడమేరు' చేపడుతున్నాం: మంత్రి నారాయణ
- బుడమేరులోని ఆక్రమణలు తొలగిస్తామన్న నారాయణ
- వరద బాధితులకు ఆహారం, తాగునీరు లోటు లేకుండా చూశామని వెల్లడి
- 77 వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించామన్న మంత్రి
పారిశుద్ధ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని నారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 77 వేల విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరించామని చెప్పారు. కలుషితమయ్యే అవకాశం ఉన్నందున, వరద ప్రాంతాల్లోని నీటిని మరో రెండు రోజుల వరకు తాగొద్దని ప్రజలకు సూచించామని తెలిపారు. వరద బాధితులు పూర్తిగా కోలుకునేంత వరకు ఆహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.