సోనియా గాంధీని కలిసిన డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ మను భాకర్
- పారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్న మను భాకర్
- విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన అభిమానులు
- సాయంత్రం సోనియా గాంధీ నివాసంలో ఆమెను కలిసిన మను భాకర్
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో, సరబ్ జోత్ సింగ్తో కలిసి మిక్స్ డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్యాలు సాధించిన మను భాకర్... మహిళల 25 మీటర్ల విభాగంలో తృటిలో పతకం కోల్పోయింది. ఈరోజు ఆమె పారిస్ నుంచి నేరుగా ఢిల్లీకి ఎయిరిండియా విమానంలో వచ్చారు. ఉదయం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.