కేబినెట్లో మాదిగలకు చోటు కల్పించండి: సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేల వినతి
- అసెంబ్లీ టీ బ్రేక్ సమయంలో సీఎంను కలిసిన మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు
- తెలంగాణలో అతిపెద్ద సామాజికవర్గమని వెల్లడి
- సీఎంను కలిసిన లక్ష్మణ్, సత్యనారాయణ, శామ్యేల్, వీరేశం, లక్ష్మీకాంతారావు
సీఎంను కలిసిన రైల్వే అధికారి
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డిని రైల్వేశాఖ చీఫ్ ఇంజనీర్ సుబ్రమణ్యమ్ కలిశారు. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ రూట్ మ్యాప్పై వివరించారు. వికారాబాద్, పరిగి, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ మీదుగా ఈ రైల్వే లైన్ను ఏర్పాటు చేస్తున్నారు. రూ.3,500 కోట్లతో 145 కిలోమీటర్ల పొడవుతో ఏర్పాటు చేయనున్న ఈ రైల్వే లైన్ రూట్ మ్యాప్పై ముఖ్యమంత్రి కొన్ని సూచనలు చేశారు.