ఓటుకు నోటు కేసు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్.. విచారణ వాయిదా
- కేసు ట్రయల్ ను భోపాల్ కు మార్చాలని కోరిన జగదీశ్ రెడ్డి
- సుప్రీంకోర్టులో జగదీశ్ రెడ్డి పిటిషన్ పై విచారణ
- ట్రయల్ ను మార్చాల్సిన అవసరమేంటని ప్రశ్నించిన సుప్రీం బెంచ్
దీనికి జగదీశ్ రెడ్డి లాయర్లు బదులిస్తూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం వల్ల ప్రాసిక్యూట్ చేసే ఏజెన్సీలు తమ అభిప్రాయం, వాదన మార్చుకునే అవకాశం ఉందని వివరించారు. కేసులో కీలకమైన ఆధారాలను తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కు రిజాయిండర్ వేసేందుకు తమకు సమయం కావాలని జగదీశ్ రెడ్డి లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుప్రీం ధర్మాసనం.. ఓటుకు నోటు కేసు విచారణను రెండు వారాల పాటు వాయిదా వేసింది.