Chandrababu: ఇరు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్న నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది: ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu tweets about Chief ministers meeting
హైదరాబాదులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 

"తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఇవాళ హైదరాబాదులో మంత్రివర్గ సహచరులతో కలిసి సమావేశమై విభజన సమస్యలపై చర్చలు జరిపాను. చాన్నాళ్లుగా పెండింగ్ లో  ఉన్న సమస్యలకు ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యంగా ఉండే పరిష్కారాలపై ఈ సమావేశంలో చర్చించాం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే విధంగా చర్చలు సాగాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగింది" అని చంద్రబాబు వివరించారు. ఈ సమావేశం తాలూకు ఫొటోలను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News

Chandrababu
Revanth Reddy
Andhra Pradesh
Telangana