చంద్రబాబుతో సమావేశమవుతున్నట్లు అమిత్ షాతో చెప్పాను: రేవంత్ రెడ్డి
- కూర్చొని పరిష్కరించుకుంటే... సహకారం ఉంటుందని అమిత్ షా హామీ ఇచ్చారని వెల్లడి
- కూర్చొని చర్చించిన తర్వాత సీఎంల స్థాయిలో పరిష్కారమవుతాయా? లేదా? తెలుస్తాయని వ్యాఖ్య
- ఇంకా సమస్య ఉంటే కేంద్రం... ఆ తర్వాత చట్టం వున్నాయని వెల్లడి
'మీరు సమస్యలు పరిష్కరించుకుంటామంటే మా సహకారం ఉంటుంది' అని అమిత్ షా తమకు హామీ ఇచ్చారని సీఎం తెలిపారు. నీటి పంపకాలు సహా ఎన్నో అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్నాయన్నారు.
సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించిన తర్వాత కదా సీఎంల స్థాయిలో పరిష్కారమవుతాయా? లేదా? అని తెలిసేది అన్నారు. ఇరువురు సీఎంలు కూర్చున్న తర్వాత కూడా ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాలు ఉంటే కేంద్రం సహకరిస్తుందన్నారు. ఇంకా సమస్య ఉంటే చట్టం ఉందన్నారు.