Chandrababu: కుప్పంలో తొలి రౌండ్ లో చంద్రబాబు ఆధిక్యం ఎంతంటే...!

Chandrababu gets 893 votes leading in 1st round counting
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు మే 13న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. నేడు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఇక, టీడీపీ అధినేత చంద్రబాబు పోటీ చేసిన కుప్పం అసెంబ్లీ స్థానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గంపై వైసీపీ ప్రత్యేక దృష్టి పెట్టడమే అందుకు కారణం. 

ఇక్కడ తొలి రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబుకు 5662 ఓట్లు, వైసీపీ అభ్యర్థి భరత్ కు 4,769 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం చంద్రబాబు 893 ఓట్ల ఆధిక్యంతో కొనసాగుతున్నారు.
Go Back to Shorts
Chandrababu
Kuppam
TDP
YSRCP

More Telugu News