అమిత్ షా నన్ను కలవాలనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ఫోన్ చేశారు: నారా లోకేశ్
- అమిత్ షాకు అన్ని విషయాలు చెప్పానన్న టీడీపీ యువనేత
- చంద్రబాబు ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నట్లు చెప్పినట్లు వెల్లడి
- సీఐడీ ఎందుకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టిందని అమిత్ షా ఆరా తీశారన్న లోకేశ్
సీఐడీ ఎందుకు పిలిచింది, ఎన్ని కేసులు పెట్టిందని తనను అడిగారన్నారు. తమపై రాజకీయ కక్షతోనే ఈ కేసులు పెట్టినట్లు తాను అమిత్ షాకు వివరించానని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్లలో దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్ప వైసీపీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. సీఎంగా జగన్ చేసిన ఒక్క మంచి పని లేదన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ను జగన్ ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.