ఇండియా బ‌య‌లుదేరిన ఆస్ట్రేలియా జ‌ట్టు.. ఈ నెల 20 నుంచి టీ20 సీరిస్‌

australia cricket team starts to india
  • 3 మ్యాచ్‌ల‌తో కూడిన టీ20 సీరిస్‌
  • ఇరు జ‌ట్ల‌ను ప్ర‌క‌టించిన రెండు దేశాల క్రికెట్ బోర్డులు
  • భార‌త్ బ‌య‌లుదేరిన‌ట్లు వెల్ల‌డించిన పాట్ క‌మ్మిన్స్‌
టీమిండియాతో టీ20 సీరిస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జ‌ట్టు భార‌త్ బ‌య‌లుదేరింది. ఈ నెల 20 నుంచి మొద‌లు కానున్న ఈ సీరిస్‌లో భార‌త్, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య 3 టీ20 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 20న మొహాలీలో జ‌రిగే మ్యాచ్‌తో ప్రారంభం కానున్న ఈ సీరిస్.. ఈ నెల హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌రిగే మ్యాచ్‌తో ముగియ‌నుంది. ఈ నెల 23న నాగ్‌పూర్‌లో రెండో టీ20 జ‌ర‌గ‌నుంది. 

ఈ సీరిస్ కోసం ఇప్ప‌టికే టీమిండియా జ‌ట్టును బీసీసీఐ ప్ర‌క‌టించింది. అటువైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కూడా ఈ సీరిస్ కోసం జ‌ట్టును ప్ర‌కటించ‌గా... ఆ జ‌ట్టు స‌భ్యులు గురువారం భార‌త్ బ‌య‌లుదేరారు. ఈ సంద‌ర్భంగా భార‌త్‌కు బ‌య‌లుదేరిన విమానంలో త‌న ఫొటోను సెల్ఫీ తీసిన ఆసీస్ జ‌ట్టు ఆట‌గాడు పాట్ క‌మ్మిన్స్‌... తాము భార‌త్ బ‌య‌లుదేరామంటూ సోష‌ల్ మీడియాలో పేర్కొన్నాడు.
Go Back to Shorts
Team India
Cricket
Australia
T20 Series
Pat Cummins

More Telugu News