పవన్ 28వ సినిమాకి రంగం సిద్ధం!
- ముగింపు దశలో 'భీమ్లా నాయక్'
- సెట్స్ పై 'హరి హర వీరమల్లు'
- లైన్లో హరీశ్ శంకర్
- త్వరలోనే పట్టాలపైకి.
ఇక ఆ తరువాత ఆయన క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా చేయనున్నారు. ఇది చారిత్రక నేపథ్యంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం. ఆ తరువాత ఆయన హరీశ్ శంకర్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలను దర్శక నిర్మాతలు పూర్తి చేశారు. తాజాగా పవన్ ను కలుసుకుని ఆ విషయం చెప్పారు కూడా.
త్వరలోనే పవన్ ఈ సినిమా కోసం రంగంలోకి దిగనున్నారు. కెరియర్ పరంగా ఇది ఆయనకి 28వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, దేవిశ్రీ సంగీతాన్ని అందించనున్నాడు. సినిమాటోగ్రాఫర్ గా ఆయాంక బోస్ .. కళాదర్శకుడిగా ఆనంద్ సాయిని ఎంపిక చేసుకున్నారు. 'గబ్బర్ సింగ్' తరువాత సెట్ అవుతున్న ఈ కాంబినేషన్ పట్ల అంతా ఎంతో ఆసక్తితో ఉన్నారు.