ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం వినిపించిన సోదరుడు ప్రహ్లాద్ మోదీ
- జీఎస్టీ కట్టకుంటే ఉద్ధవ్, మోదీ మీ ఇంటికే వస్తారు
- మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం.. బానిసత్వంలో కాదు
- ఉల్హాసన్నగర్ వ్యాపారుల సమావేశంలో ప్రహ్లాద్ మోదీ
‘‘నరేంద్రమోదీ కానీయండి, మరొకరు కానీయండి. ఎవరైనా సరే మొదట మీ సమస్యలను వినాలి. కాబట్టి ఈ రోజు నేను మీకు చెబుతున్నది ఒకటే. సమస్యలను పరిష్కరించేంత వరకు జీఎస్టీ కట్టబోమని తొలుత మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. మనమేమీ బానిసలం కాదు’’ అని ప్రహ్లాద్ మోదీ అన్నారు. తాను దేశవ్యాప్తంగా 6.50 లక్షల ఫెయిర్ ప్రైస్ దుకాణ యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఈ సందర్భంగా వ్యాపారులు మాట్లాడుతూ కొవిడ్, లాక్డౌన్ తమను ఎలా దెబ్బతీసిందీ వివరించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించామంటూ పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తున్నారని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.