మహారాష్ట్రలో లాక్డౌన్ వద్దంటూ ఛత్రపతి శివాజీ వంశస్థుడైన బీజేపీ ఎంపీ భిక్షాటన
- రాష్ట్రంలో లాక్డౌన్ విధించాలని ప్రభుత్వం యోచన
- వద్దంటూ బీజేపీ ఎంపీ ఉదయన్ భోస్తే భిక్షాటన
- రూ.450 భిక్షం డబ్బులు జిల్లా అధికారులకు అందజేత
లాక్డౌన్ విధిస్తే ప్రజలకు కష్టాలు తప్పవని, వ్యాపారులు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడతారని, కాబట్టి లాక్డౌన్ ఆలోచనలను మానుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఛత్రపతి శివాజీ వంశస్థుడైన బీజేపీ ఎంపీ ఉదయన్ రాజే భోస్లే కూడా లాక్డౌన్ వద్దంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.అంతేకాక, పళ్లెం పట్టుకుని రోడ్డు మీద కూర్చుని భిక్షాటన చేపట్టారు. ఈ సందర్భంగా తనకు వచ్చిన రూ. 450ని జిల్లా అధికారులకు అందిస్తూ లాక్డౌన్ నిర్ణయాన్ని ప్రభుత్వం మార్చుకోవాలని కోరారు.